తొర్రూర్ లో కరోనా వ్యాక్సిన్ కేంద్రాన్ని ప్రారంభించిన మంత్రి ఎర్రబెలి

మహబూబాబాద్ జిల్లా
తొర్రూర్ జనవరి 16,
తొర్రూర్ శనివారం ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కోవిడ్ వ్యాక్సిన్ కేంద్రాన్నిప్రారంభించిన రాష్ట్ర పంచాయతీరాజ్,గ్రామీణాభివృద్ధి,గ్రామీణమంచినీటిసరఫరాశాఖల మంత్రి ఎర్రబెల్లి దయాకర్ రావు.నిర్ణీత వైద్యులు, ఫ్రంట్ లైన్ వారియర్స్ కి మొదటి విడతగా, డాక్టర్ల చేత మంత్రి దగ్గరుండి వ్యాక్సినేషన్ చేయించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ
ప్రధాని మోడీ, సీఎం కెసిఆర్ ల కృషి వల్ల ఈ రోజు దేశ, మన రాష్ట్ర ప్రజలందరికీ కోవిడ్ వ్యాక్సిన్ అందుబాటులోకి వచ్చిందని అన్నారు.ప్రపంచ వ్యాప్తంగా ప్రజలు కోవిడ్ నివారణకు వ్యాక్సిన్ కోసం 9 నెలలుగా ఎదురు చూస్తున్నారని, ముందుగానే మన దేశంలో వ్యాక్సిన్ కనుక్కోవడం, అవి అందుబాటులోకి రావడం సంతోషించదగ్గ విషయంమన్న
వ్యాక్సిన్ వేసుకున్న తర్వాత 28 రోజుల వరకు జాగ్రత్త వహిస్తూ పర్యవేక్షణలో ఉండాలని తెలిపారు.ఈ రోజు నుంచి దేశంతో సహా, మన రాష్ట్రంలోనూ కోవిడ్ వ్యాక్సిన్ ని ప్రజలకు ఇస్తున్నామని
రాష్ట్ర వ్యాప్తంగా 139 కేంద్రాల్లో రోజు వ్యాక్సినేషన్ ని ప్రారంభడం జరుగుతుందని. ఇదిఅదృష్టంగాభావిస్తున్నామని వరంగల్ పూర్వ జిల్లాలో 21 కేంద్రాల్లో కరోనా నివారణ వ్యాక్సిన్ ఇవ్వడాన్ని కి ప్రణాళికలుచేసిప్రారంభించమని అన్నారు.మహబూబాబాద్ జిల్లాలో.. 12737 మంది కరోనా బారిన పడ్డారని
వీరిలో 12597 మంది చికిత్స పొంది కోలుకున్నారని. మహబూబాబాద్ జిల్లాలో 4, కేంద్రాల ద్వారా ప్రజలకు ఉచితంగా టీకాలు వెయ్యడం జరుగుతుందని ఒక్కో సెంటర్ లో 30 మంది చొప్పున వేస్తారనిడాక్టర్స్ కు ,ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య సిబ్బందికి మొదట వ్యాక్సిన్లు వేయాలని నిర్ణయించామనిఉమ్మడి జిల్లాలో 92 ప్రాంతాల్లో వ్యాక్సిన్ ని స్టోరేజీ చేయనున్నట్లు మంత్రి తెలిపారు.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు వ్యాక్సినేషన్ కు కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశామని,వ్యాక్సిన్లు తీసుకున్నవారినిపర్యవేక్షించేందుకు సెంటర్లు ఏర్పాటు చేశామని,మొదటి విడతలో వైద్య సిబ్బందికి, రెండో విడతలో ఫ్రంట్ లైన్ సిబ్బంది, వారియర్స్ కి, ఆ తర్వాత 50 ఏళ్ళు దాటిన వృద్ధులు, ఆతర్వాత 18 ఏళ్ళ నుండి 50 ఏళ్ళ లోపు వాళ్ళకు వ్యాక్సిన్లు వేస్తారని,దీర్ఘకాలికవ్యాధులున్న వాళ్ళకు కూడా టీకాలు వేస్తారని 18 ఏళ్ళు నిండిన వాళ్ళకు మాత్రమే వ్యాక్సిన్లు వేస్తారని మొదటి, రెండో డోసులు పడితేనే, వ్యాక్సిన్ పూర్తిగా వేసుకున్నట్లు అన్నారు.టీకాలువేసుకున్నప్పటికీ మాస్కులు ధరించాలి, సామాజిక భౌతిక దూరం పాటిస్తూ జాగ్రత్తగా ఉండాలి అన్నారు.వ్యాక్సిన్లపై తప్పుడు ప్రచారాలు చేసిన వాళ్ళపైకఠినచర్యలుంటాయన్నారు. అన్ని రకాల పరీక్షలు, జాగ్రత్తలు తీసుకున్న తర్వాతే, వ్యాక్సిన్లు వేయడాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలుప్రారంభించాయని,
వైద్యులు, సిబ్బంది, ఆశా వర్కర్లు, పారిశుద్ధ్య సిబ్బంది కరోనా ఫ్రంట్ లైన్ వారియర్స్ గా కరోనా పై గట్టి పోరాటం చేశారన్నారు. కుటుంబ సభ్యులు కూడా కరోనా బాధితులను పట్టించుకోలేని పరిస్థితుల్లో వీరంతా అద్భుతంగా పని చేశారు. కరో్నాతో చనిపోయిన వారిని ఎవరూపట్టించుకోని సమయాల్లో ప్రజాప్రతినిధులు, మున్సిపాలిటీ, గ్రామాల పంచాయతీలు, ఇతర సిబ్బంది పట్టించుకుని, తమ ప్రాణాలను సైతం ఫణంగా పెట్టి పని చేశారనన్నారు.వాళ్ళందరినీ అభినందిస్తున్నన్నారు. ఇక ఈ వ్యాక్సిన్లను ప్రతి ఒక్కరికీ అందేలా ప్రజాప్రతినిధులు, అధికారులు, వైద్య సిబ్బంది కృషి చేయాలన్నారు.
అనంతరం తొర్రూర్ పట్టణంలో రద్దీ పెరగడం వల్ల ఆక్సిడెంట్ల దృష్ట్యా వాటి నివారణకు కూరగాయల మార్కెట్ గాంధీ సెంటర్ వద్ద బస్టాండ్ అన్నారం రోడ్డు మార్కెట్ ఆవరణలో ఏర్పాటు చేయనున్న ట్రాఫిక్ సిగ్నల్ పాయింట్ల పనులకు మంత్రి కొబ్బరికాయ కొట్టి శంకుస్థాపన చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు కలెక్టర్ అభిలాష అభినవ్ ఎంపీపీ చిన్న అంజయ్య జెడ్ పి టి సి శ్రీనివాస్, మున్సిపల్ చైర్ పర్సన్ రామచంద్రయ్య, డిప్యూటీ డిఎంఅండ్హెచ్ఓ కోటచెలం, మున్సిపల్ కమిషనర్ గుండె బాబు మెడికల్ ఆఫీసర్ దిలీప్, తాసిల్దార్ రాఘవరెడ్డి. పెద్దవంగర ఎంపీపీ జడ్పిటిసి రాజేశ్వరి కిరణ్ మై డీఎస్పీ వెంకటరమణ మండల ప్రత్యేక అధికారి ఆంజనేయ స్వామి. అధికారులు ప్రజా ప్రతినిధులు ఏఎన్ఎంలు ఆశ వర్కర్లు తదితరులు పాల్గొన్నారు.